← Back to news

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలి

By Wenky· 3d ago· Buggaram, Buggaram, Jagitial
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలి

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన దాదాపు రూ. 14,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ డిమాండ్ చేసింది. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల్ DT రాకేష్‌కి జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. జిల్లా నాయకులు మానాల కిషన్ మాట్లాడుతూ ప్రభుత్వ నిధులు విడుదల కాకపోవడంతో ఫీజులు చెల్లించలేని దుస్థితి ఏర్పడిందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తమ చదువులను కొనసాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

More in Local