← Back to news

అదనపు కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య

By A VIJAY KUMAR· 2d ago· Hanumakonda
అదనపు కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య

TG: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో అదనపు కట్నం వేధింపులతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరికి చెందిన అఖిల(24)కు ప్రవీణ్‌రెడ్డితో 2022లో వివాహమైంది. రూ.50 వేల అదనపు కట్నం కోసం భర్త, అత్తింటివారు వేధించేవారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయమై తరచూ దంపతుల మధ్య గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. రాత్రి కూడా దంపతుల మధ్య వివాదం జరగగా, అఖిల ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

More in Local