పులివెందులలో ఏకకాలంలో ఈడీ సోదాలు

AP: కడప జిల్లా పులివెందులలో శుక్రవారం ఉదయం ఈడీ సోదాలు కలకలం రేపాయి. ఉదయం 6 గంటల నుంచి పలువురు ప్రముఖుల నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి తదితరుల ఇళ్లలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వీరంతా సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు.



