భూముల రీసర్వే.. 108 గ్రామాల్లో హడావిడి!

రంగారెడ్డి జిల్లాలో భూముల సర్వే పనులు ముమ్మరం. అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి తహసిల్దార్లకు క్లియర్ ఆర్డర్ ఇచ్చారు. షాద్నగర్ ఆర్డీవో కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో 611 గ్రామాలకు గాను 108 గ్రామాల్లో సర్వే కొనసాగుతోంది. భూభారతి, 22ఏ విషయాల్లో బ్రోకర్లను నమ్మొద్దని రైతులకు హెచ్చరించారు. రెవెన్యూ అధికారుల సలహా తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీవో సరిత పాల్గొన్నారు.



