బైకులను గాయబ్ చేస్తున్నోళ్ల అరెస్టు
వరుసగా బైకులు దొంగిలిస్తూ, చైన్ స్నాచింగుకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఆరు బైకులతో పాటు, తులంన్నర బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు.ఈ నెల 18న సారంగాపూర్ మండలం అర్రపెల్లిలో రాత్రి వేళ చైన్ స్నాచింగ్ జరిగింది. బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు... పక్కా సమాచారంతో రేచపల్లి ఎక్స్ రోడ్ వద్ద నిందితులు రేగొండ జగదీశ్వర్, ఎలాగందుల పవన్ చందులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు దొంగిలించిన బైకులను కొనుగోలు చేసిన వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు.




