భీమదేవరపల్లి మండల కమిటీ ఏర్పాటు

ఎమ్మార్పీఎస్ భీమదేవరపల్లి మండల నూతన కమిటీని ఏర్పాటు చేసింది. ముల్కనూరులోని విశ్వశాంతి హైస్కూల్లో ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా ఇన్చార్జి వెంకటేశ్వరరావు మాదిగ, జిల్లా కో-ఇన్చార్జి తనుగుల విజయ్ మాదిగ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భీమదేవరపల్లి మండల అధ్యక్షుడిగా వేల్పుల ప్రశాంత్ మాదిగ, అధికార ప్రతినిధిగా మాడుగుల ప్రణయ్దేవ్, ప్రధాన కార్యదర్శిగా మిట్టపల్లి రమేష్, ఉపాధ్యక్షులుగా ఎర్రబెల్లి దిలీప్ ఎన్నికయ్యారు.



