YSRCP దీక్షలో ఉద్రికత్త..టెంట్ తొలగింపు

AP: DSC అక్రమాలపై బాధ్యత వహించి మంత్రి నారా లోకేశ్ రిజైన్ చేయాలంటూ YSRCP రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. గుంటూరు, అనంతపురం జిల్లా, విజయవాడ సెంట్రల్ ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుపై పర్మిషన్లు లేకుండా టెంట్ ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ TDP నాయకులు టెంట్లను తొలగించారు. రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సీఎం చంద్రబాబు, లోకేశ్లపై కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదని విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమా హెచ్చరించారు.



