డాక్టర్లు సంతకాలు చేసి.. క్లినిక్కులకా? MLA షాక్!

శ్రీకాకుళం జిల్లా పలాస Govt హాస్పిటల్లో సోమవారం MLA గౌతు శిరీష సర్ప్రైజ్ చెకింగ్ చేశారు.<br>వైద్యులు సంతకాలు చేసి ప్రైవేట్ క్లినిక్లకు వెళ్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని సమయాల్లో డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గరుడఖండి వద్ద ప్రమాదానికి గురైన 5గురు ఉపాధ్యాయులకు సకాలంలో వైద్యం అందలేదనే ఫిర్యాదులపైనా ఆరా తీశారు. ఇందుకు బాధ్యులైన వైద్యులు వివరణ ఇవ్వాలని, సోమవారం సాయంత్రం జిల్లా వైద్యాధికారులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. మరి మీఊళ్లో ఎలా ఉంది? comment please.



