9వ తరగతి నుంచే ప్లానింగ్

TG : పదో తరగతి పరీక్షల్లో మంచి రిజల్ట్స్ రావాలంటే విద్యార్థులు 9వ తరగతి నుంచే ప్లాన్ ప్రకారం చదువుకోవాలని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. తిర్యాణి ZPHSలో స్టూడెంట్స్, టీచర్లతో జరిపిన రివ్యూలో ఆయన మాట్లాడారు. విద్యార్థులపై ఒత్తిడి పెంచకుండా వారిలో ఉన్న కొత్త ఆలోచనలు బయటకు తీసేందుకు 'విద్యా ప్లస్' ప్రోగ్రామ్ను వాడుకోవాలని చెప్పారు. ప్రతిఒక్కరూ యోగా, ఎక్సర్సైజ్ ద్వారా ఆరోగ్యంగా ఉండటానికి ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ క్లబ్ల ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.



