కరెంటు కోతలు, లో-వోల్టేజ్పై బీజేపీ ధర్నా

TG: రైతులకు నిరంతర విద్యుత్ అందించడంతో పాటు కరెంటు కోతలు, లో-వోల్టేజ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం స్టేజి వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మండల అధ్యక్షుడు కోడె రమేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో రైతులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే యూరియా విక్రయించాలని, రైతులకు సరిపడా ఎరువులను సకాలంలో అందుబాటులో ఉంచాలని కోరారు.
