← Back to news

'అటు వైపు ఎవరూ వెళ్లొద్దు'

By DK· 10 Jun 2026· పోలవరం జిల్లా
'అటు వైపు ఎవరూ వెళ్లొద్దు'

AP: పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దేవీపట్నం మండలం నేలకోట సమీపంలోని కొండ ప్రాంతంలో సంచరిస్తున్న పులిపై ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశారు. అధునాతన థర్మల్ డ్రోన్లతో పులి కదలికలను రాత్రి పగలు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ రెస్క్యూ టీమ్‌లు, ట్రాంక్విలైజేషన్ బృందాలు, డ్రోన్ బృందాలు, ఫీల్డ్ సిబ్బంది వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించారు. అవసరమైనప్పుడు వెంటనే చర్యలు తీసుకునేందుకు అన్ని టీమ్‌లు రెడీగా ఉన్నాయి. కొండ వైపు ఎవరూ వెళ్లొద్దని అధికారులు సూచించారు.

More in Local