పెద్దపులి సంచారం.. భయం భయం

AP: ఏలూరు జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి బుట్టాయగూడెం మండలంలోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిమ్మలగూడెం శివారు పాలకుంట చెరువు వద్ద పులి దాడిలో 2ఆవులు మృతి చెందాయి. అటవీ ప్రాంతాల్లో ఎవరూ ఒంటరిగా తిరగవద్దని అటవీ అధికారుల సూచించారు. పులికి అమర్చిన రేడియో కాలర్తో కదలికలను సిబ్బంది పరిశీలిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు మత్తుమందు, బోన్లు సిద్ధం చేశారు. సమీప అటవీ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.



