← Back to news

మైనింగ్ బ్లాస్ట్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

By VEMANNA JAY· 3d ago
మైనింగ్ బ్లాస్ట్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

TG: జోగులాంబగద్వాల జిల్లా గట్టు మండలంలో భారత్‌మాల పథకంలో భాగంగా జరుగుతున్న రహదారి పనులకు సంబంధించిన క్రషర్‌ కార్యకలాపాలపై సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తంచేశారు. సల్కాపురం, జోగన్‌గట్టు గ్రామాల శివారులో మెగా కంపెనీకి సంబంధించిన సబ్‌కాంట్రాక్ట్‌ క్రషర్‌ ఐదేళ్లుగా కొనసాగుతోందని సీపీఎం నాయకుడు నర్సింహులు తెలిపారు. సల్కాపురం గ్రామానికి చెందిన రైతు ఏసన్నకు చెందిన రెండున్నర ఎకరాల పొలంలో బోరుబావి ఉందన్నారు. క్రషర్‌ నుంచి వెలువడుతున్న కంకర, దుమ్ము, బ్లాస్టింగ్‌ ప్రభావంతో బోరుబావి పూడిపోయిందని ఆరోపించారు.

More in Local