టీచర్లు ఆస్పత్రికి తీసుకెళ్లినా దక్కని ప్రాణం!

నారాయణపేట జిల్లా ఎక్లాస్పూర్లో ఒక శాడ్ ఇన్సిడెంట్ జరిగింది. స్థానిక గవర్నమెంట్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న రంజిత్ (8) అనే స్టూడెంట్ని గురువారం క్లాస్రూమ్లో ఉండగానే పాము కాటువేసింది. గమనించిన టీచర్లు వెంటనే అతడిని గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. కానీ అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ రంజిత్ చనిపోయాడు. క్లాస్రూమ్లోనే చిన్నారికి పాము కరవడంతో బాధితుడి ఫ్యామిలీ మెంబర్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో ఊరంతా షాక్లో ఉండిపోయింది.



