← Back to news

గ్రామాల్లో ప్రధాన సమస్యలు పరిష్కరించాలి

By Ramu· 4d ago
గ్రామాల్లో ప్రధాన సమస్యలు పరిష్కరించాలి

గ్రామాల్లో ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని పానగల్ ఎంపీడీవో కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్డి జబ్బర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్య వైద్య రంగాలు నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని, వందరోజుల పని చేసినటువంటి ఉపాధి కూలీలకు పెండింగ్ డబ్బులు ఇవ్వాలని కోరారు. వంద రోజుల పనిని 200 రోజులకు పెంచి, రోజు కూలి రూ.700 ఇవ్వాలని డిమాండ్ చేశారు.

More in Local