ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలపై జంగ్

TG: ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలపై జంగ్ సైరన్ మోగిస్తున్నట్లు టీజీజేఏసీ కామారెడ్డి ప్రతినిధులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో సీపీఎస్ రద్దు కోరుతూ కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 27న వేలాది మంది ఉపాధ్యాయ, ఉద్యోగులతో ర్యాలీ తీస్తామన్నారు. పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. సంఘం బాధ్యులు వెంకట్రెడ్డి, దేవేందర్, కుషాల్, అంబీర్ మనోహర్ రావు తదితరులు పాల్గొన్నారు.



