నో వెహికిల్ చెకింగ్.. ఓన్లీ స్లీపింగ్

TG: భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని మోరంపల్లిబంజర్ చెక్పోస్ట్లో పనిచేస్తున్న గార్డు పట్టపగలే నిద్రపోతున్న విషయం బయటపడింది. చెక్పోస్టు పర్యవేక్షణ బాధ్యత చూడాల్సిన FBO అక్కడ లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది గార్డును ఉంచి వెళ్లడంతో ఆ వ్యక్తి డ్యూటీ టైమ్లో నిద్రపోతూ కన్పించాడు. నిత్యం వందలాది వాహనాలు ఈ చెక్పోస్టు మీదుగా వెళ్తున్నా తనిఖీ చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గార్డు 24 గంటలూ విధులు నిర్వహించాల్సి ఉండగా ఇలా పట్టపగలు నిద్ర పోతున్నాడంటే అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.



