లోక్సభలో రాహుల్ ‘మూడు కేటగిరీల’ కామెంట్స్
సభలో మాట్లాడిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రజలను విద్యార్థులు, ఇడియట్లు, అంధభక్తులు అంటూ మూడు కేటగిరీలుగా విడదీస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జ్ఞానాన్ని స్వీకరించేవాడే విద్యార్థి అని, తమకే అంతా తెలుసనుకునే వాళ్లు ఇడియట్లని, వారిని గుడ్డిగా నమ్మేవాళ్లు అంధభక్తులని నిర్వచనం చెప్పారు. ఈ కామెంట్స్పై అధికార పక్ష ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. 'ఇడియట్' అనే పదం పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధమని, రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.



