రేపు ప్రైవేటు స్కూల్స్ బంద్!

TG : నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యకు నిరసన తెలుపనున్నారు. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ రేపు(శుక్రవారం) ప్రైవేటు పాఠశాలల బంద్ నిర్వహించాలని TRSM అసోసియేషన్ పిలుపునిచ్చింది. హత్యకు కారణమైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని Association నాయకులు డిమాండ్ చేశారు.



