ఇతను ఏపీ బిట్టూ.. మెచ్చుకున్న మాధవన్!

మధ్యప్రదేశ్లో బిట్టు తబాహీ కంటే ముందు, ఆంధ్రప్రదేశ్లో కాంత్ అనే యువకుడు 500 ఏళ్ల పురాతన దేవాలయ స్టెప్వెల్ను శుభ్రం చేయడానికి పోరాడాడు. ఆ స్టెప్వెల్.. ప్లాస్టిక్, కొబ్బరిచిప్పలు ఇతర చెత్తతో నిండి ఉండేది. అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా 300 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి శుభ్రం చేశారు. ఈ ప్రయత్నాన్ని నటుడు ఆర్.మాధవన్ కూడా ప్రశంసించాడు. ఇది వారసత్వ సంరక్షణ, చెత్తకి వ్యతిరేకంగా ప్రజల్లో కలుగుతున్న ఆసక్తిని బయటపెడుతోంది.



