డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో అక్రమాలపై సంతకాల సేకరణ

TG: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలు, అర్హతలేని వ్యక్తులకు ఇళ్ల కేటాయింపుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల ప్రజలు సంతకాల సేకరణ చేపట్టారు. అనర్హులకు ఇళ్లు కేటాయించారనే ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని ప్రజలు కోరుతున్నారు. సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు సమర్పించారు.



