← Back to news

చివ్వెంల మండలంలో టీచర్ల నిరసన

By Ramakrishna· 20 Aug 2026
చివ్వెంల మండలంలో టీచర్ల నిరసన

TG: చివ్వెంల మండల కాంప్లెక్స్ సమావేశాల సందర్భంగా ఉదయం టీ విరామ సమయంలో చివ్వెంల ZPHSలో టీచర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. 2వ PRCని వెంటనే అమలు చేయాలని, పెండింగ్ డీఏలన విడుదల చేయాలని కోరారు. CPSని రద్దు చేసి OPSను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 27న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరగనున్న ధర్నాను విజయవంతం చేయాలని, సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా నిరసన తెలపాలని, సెప్టెంబర్ 10న ఛలో హైదరాబాద్ మహాధర్నాకు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.

More in Local