షాప్ బోర్డు పెడుతుండగా షాకింగ్ ఘటన

TG: హైదరాబాద్ బాలానగర్లో షాప్ బోర్డు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో సంజు చౌదరి(26) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలానగర్ PS పరిధిలోని గురుకృప ప్లైవుడ్ అండ్ హార్డ్వేర్ షాప్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బోర్డు ఏర్పాటు చేస్తుండగా పైనున్న కరెంట్ వైర్లు సంజు చౌదరికి తగలడంతో షాక్ వచ్చింది. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.



