ఘటనపై సమగ్ర విచారణ జరపాలి: CM రేవంత్ రెడ్డి

TG: హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో నర్సు హత్యాచార ఘటనపై మేజిస్టీరియల్ విచారణ జరిపించాలని CM రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, హాస్టల్ ప్రదేశంలో భద్రత, సంస్థ నిర్వహణలో నిర్లక్ష్యం, మహిళా ఉద్యోగుల భద్రతా నిబంధనల అమలుపై సమగ్రంగా విచారించాలని సూచించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో దర్యాప్తు, ఫోరెన్సిక్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి పకడ్బందీగా ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు.



