Sailingలో గురుకుల స్టూడెంట్స్కు మూడు మెడల్స్

కర్ణాటకలోని మైసూరులో జరిగిన యూత్ & జూనియర్ మల్టీక్లాస్ సెయిలింగ్ ఛాంపియన్షిప్-2026లో తెలంగాణ బీసీ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు.420 మిక్స్డ్ క్లాస్లో కామారెడ్డి గురుకుల విద్యార్థిని రిష్విత గోల్డ్, హైదరాబాద్ చంద్రాయణగుట్టకు చెందిన శిరీష సిల్వర్ మెడల్స్ గెలిచారు. బాయ్స్ విభాగంలో షామీర్పేట్ గురుకుల విద్యార్థి జె.ధనుష్ బ్రాంజ్ మెడల్ సాధించాడు. మునుగోడు గురుకుల స్టూడెంట్ హనుమంతు 24 మంది పోటీదారుల్లో 14వ ప్లేస్లో నిలిచాడు.



