ఒకే సెంటర్లో టెట్ పరీక్ష రాసిన తండ్రీకూతుళ్లు

AP: శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం తోటఊరు గ్రామానికి చెందిన తోట ఈశ్వరరావు, ఆయన కుమార్తె తోట శోభ విద్యారంగంలో అరుదైన ఉదాహరణగా నిలిచారు. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తూ ఇటీవల నిర్వహించిన టెట్కు అటెండ్ అయ్యారు. ఇద్దరూ ఒకే కేంద్రంలో పరీక్ష రాశారు. తన తండ్రితో కలిసి టెట్ రాయడం మరపురాని అనుభవంగా నిలిచిందని తోట శోభ ఆనందం వ్యక్తం చేశారు.



