విద్యార్థుల కోసం అర్ధనగ్న ప్రదర్శన.. గిరిజనుల నిరసన
AP : విశాఖపట్నం మారికవలస గురుకుల పాఠశాలను కొనసాగించాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం, విద్యార్థుల తల్లిదండ్రులు నిరసనలు తెలిపారు. జగదంబ నుంచి కలెక్టరేట్ వరకు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి జిల్లా కలెక్టర్ కు విన్నతి పత్రం ఇచ్చారు. GO 69 సాకుతో 5, 6, 7 తరగతుల పిల్లలను స్కూల్ నుంచి టిసి ఇచ్చి తొలగిస్తూ, వెళ్లి వేరేచోట చదువుకోండని భయపెడుతున్నారని అన్నారు. విద్యాశాఖ మంత్రి వెంటనే స్పందించి, తమ పిల్లల చదువులు ఇక్కడే కొనసాగేలా న్యాయం చేయాలని గిరిజన నాయకులు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.



