తెలంగాణలో రేపటి నుంచి ఆన్ లైన్ జనగణన

తెలంగాణలో తొలిసారిగా జనాభా లెక్కలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా జనాభా లెక్కల షెడ్యూల్ ను తెలంగాణ రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళికేరి ప్రకటించారు. జనగణన రెండు దశల్లో జరగనుంది. మొదటి దశలో ఏప్రిల్ 26 నుంచి మే 9 వరకు ఆన్ లైన్ లో డీటైల్స్ ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరిస్తారు. తుది దశలో ఫిబ్రవరి 9, 2027 నుంచి ఫిబ్రవరి 28, 2027 వరకు జనగణన నిర్వహిస్తారు. జనాభా లెక్కల సేకరణ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుంది.



