ఆర్టీవో ఆఫీస్లో అవస్థలు

TG: జోగులాంబ గద్వాల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఇంటర్నెట్ సర్వర్లు నిలిచిపోవడంతో సేవలు స్తంభించిపోయాయి. గంటల తరబడి టెక్నికల్ సమస్య తలెత్తడంతో కార్యాలయానికి వచ్చిన వాహనదారులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. లైసెన్స్ టెస్టులు, లెర్నింగ్ లైసెన్స్ల(LLR) జారీ, వాహనాల రిజిస్ట్రేషన్లు, యాజమాన్య బదిలీ వంటి కీలక ప్రక్రియలన్నీ నిలిచిపోయాయి. ముందుగానే స్లాట్లు బుక్ చేసుకుని సమయానికి వచ్చినవాళ్లు టైం, ఫీజు వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



