అమలాపురం డిపో మేనేజర్గా ప్రేమ్ కుమార్

AP: ప్రయాణికులకు మెరుగైన, సురక్షితమైన రవాణా సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని అమలాపురం ఆర్టీసీ డిపో నూతన మేనేజర్ టీ. ప్రేమ్కుమార్ తెలిపారు. కోనసీమ జిల్లా అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిపో పరిధిలోని బస్సుల కండిషన్పై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. బస్సులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయిస్తూ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బస్సుల్లో పరిశుభ్రత, నిర్వహణ, సమయపాలనకు అధిక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.



