'మెటా' యూ-టర్న్.. కంగనా ఏమన్నారంటే?
ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్బుక్ పోస్టును తొలగించిన ఘటనపై మెటా క్షమాపణ చెప్పడాన్ని BJP MP కంగనా రనౌత్ స్వాగతించారు. ఈ అంశాన్ని పరిశీలించిన పార్లమెంటరీ కమిటీలో తాను కూడా సభ్యురాలినని తెలిపారు. కమిటీ చైర్మన్ నిషికాంత్ దుబే మెటాను క్షమాపణ చెప్పాలని గట్టిగా డిమాండ్ చేశారని పేర్కొన్నారు. దేశ వ్యతిరేక శక్తులకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ప్రోత్సాహం కల్పిస్తున్న అంశంపై ఆందోళన వ్యక్తం చేశామన్నారు. చివరకు మెటా తన తప్పును ఒప్పుకోవడం సంతోషకరమని కంగనా అన్నారు.



