మహానడు వేదిక విజయనగరం !!

టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు 2026 ఈసారి విజయ నగరం జిల్లాలో జరుగుతోంది. అందుకు తగ్గ స్థల పరిశీలన ఏర్పాట్లు చేయాలని టీడీపీ అధిష్టానం పార్టీ వర్గాలను ఆదేశించింది.మే 28న ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. నెల్లిమర్లలో ఈ సారి ఈ వేడుకలు జరుగుతాయి.మే 27,28,9తేదీల్లో జరిగే ఈ వేడుకలకు నెల్లిమర్ల ముస్తాబవుతోంది.నెల్లిమర్ల విజయనగరానికి ఆనుకుని ఉండటం, జాతీయ రహదారికి దగ్గరలో ఉండటం వల్ల ఎక్కువమంది హాజరవడానికి ఆస్కారం ఉంది. సభాప్రాంగణం, పార్కింగ్,విడిది వసతులు చూస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీ క్లీస్ స్వీప్ చేసింది.


