కత్తితో గొంతులో పొడిచి హత్య చేసిన భర్త

సంగారెడ్డి జిల్లాలో వివాహేతర సంబంధం కారణంగా సిద్ధారెడ్డి తన భార్యను కిరాతకంగా హత్య చేశాడు. ప్రియుడు పవన్ రెడ్డితో కలిసి వెళ్ళిపోయిన కవితను పోలీసులు గుర్తించి తిరిగి తీసుకువస్తుండగా, దారిలో భర్త సిద్ధారెడ్డి ఆమెతో గొడవపడ్డాడు. కోపంతో ఊగిపోయిన అతను కత్తితో ఆమె గొంతులో పొడవడంతో కవిత చనిపోయింది. ఈ ఘటనపై జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


