గౌతు లచ్చన్న సేవలు మరువలేనివి

AP: సర్దార్ గౌతు లచ్చన్న సేవలు మరువలేనివని మాజీ మంత్రి గౌతు శివాజీ అన్నారు. లచ్చన్న 117వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కిష్టపురం గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మందస మండలం మందస, బాలిగాం జంక్షన్ లలో మండల టిడిపి అధ్యక్షులు భావన దుర్యోధన ఆధ్వర్యంలో గౌతు లచ్చన్న జయంతి వేడుకలు నిర్వహించారు.




