విద్యార్థినుల భద్రతపై దృష్టి సారించాలి: DSP

AP: విద్యార్థునుల భద్రతపై దృష్టి సారించాలని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని సూచించారు. మందస మండలం పట్టులోగాం గిరిజన బాలికోన్నత ఆశ్రమ పాఠశాలను సీఐ ఎం.తిరుపతిరావు, ఎస్ఐ కె.కృష్ణ ప్రసాద్లతో కలిసి తనిఖీ చేశారు. అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్శాఖ తరపున ఆశ్రమ పాఠశాలలో రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో పర్యటించి చట్టాలపై అవగాహన కల్పించారు.




