← Back to news

రౌడీ షీటర్లకు పల్నాడు పోలీసుల కౌన్సిలింగ్

By ORSU KRISHNA· 16 Aug 2026· Narasaraopeta (R)
రౌడీ షీటర్లకు పల్నాడు పోలీసుల కౌన్సిలింగ్

AP: పల్నాడు జిల్లాలో నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగినవారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆదేశాల మేరకు అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఈ కార్యక్రమం చేపట్టారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలికి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

More in Local