← Back to news

మైలవరం భూనిర్వాసితుల నిరాహార దీక్ష

By Venkat V· 17 Aug 2026

AP: ఎన్టీఆర్ జిల్లా మైలవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో చంద్రాల, వెల్వడం, భూ నిర్వాసితులు నిరాహార దీక్ష చేపట్టారు. 2016లో రోడ్డు వైండింగ్‌లో భాగంగా తమ ఇల్లు, స్థలాలు కోల్పోయామని, 11 ఏళ్లుగా నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నమని బాధితులు తెలిపారు. 60 కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి లోకేశ్ గ్రామానికి వచ్చి బాధితుల పరిస్థితిని గమనించాలని కోరారు. సమస్య పరిష్కరించుకుంటే దీక్షను విరమించేది లేదంటూ హెచ్చరించారు.

More in Local