మచిలీపట్నం డివిజన్ ఫోటోగ్రాఫర్ల సంఘ ఎన్నికలు

AP: మచిలీపట్నం డివిజన్ ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. కొత్త అధ్యక్షుడిగా గురిజాల సుధీర్, కార్యదర్శిగా వంక అనంత కుమార్, ట్రెజరర్గా బైత సత్యనారాయణని, గౌరవ అధ్యక్షులుగా చిలంకుర్తి నాగభూషణం(శేషు)ని మరో 21 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఫోటోగ్రఫీ డే పురస్కరించుకుని ఆగస్టు 19న నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం జరుగుతుందని చెప్పారు.



