మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు జరిమానా

TG: నాంపల్లికి చెందిన రాకేష్ వర్మ కుమారుడు హైదరాబాద్లోని మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ కోర్సులో చేరారు. మొదటి సంవత్సరం ట్యూషన్ ఫీజు కింద రూ.80వేలు చెల్లించారు. పదోతరగతి, ఇంటర్ ఒరిజినల్ సర్టిఫికెట్లను కాలేజీ సిబ్బంది తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో మొదటి సెమిస్టర్ పూర్తయిన తర్వాత విద్యార్థి చదువును ఆపేశాడు. సర్టిఫికెట్లు తిరిగివ్వాలని విద్యార్థి, అతని తండ్రి కాలేజీ చుట్టూ తిరిగారు. అదనంగా రూ.80వేలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని యాజమాన్యం పేర్కొంది. వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించడంతో రూ.1.10 లక్షలను చెల్లించాలని పేర్కొంది.



