← Back to news

చెట్లకొమ్మల విషయంలో కొట్టుకున్న అధికారులు

By DK· 13 Jun 2026· Dishadaily· మెదక్ జిల్లా

TG: మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్‌లో విరిగి పడిన చెట్లకొమ్మల విషయంలో అటవీశాఖ అధికారులు, విద్యుత్‌శాఖ అధికారుల మధ్య ఘర్షణ జరిగింది. ఇది ఫారెస్ట్ ఏరియా అని అటవీశాఖ అధికారులు వాదించగా, కరెంట్ వైర్లు ఎలా వేయాలంటూ విద్యుత్‌శాఖ అధికారుల మధ్య వివాదం మొదలైంది. మాట మాట పెరిగి అధికారులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. చెట్లకొమ్మల తొలగింపు విషయంలో రెండు డిపార్ట్‌మెంట్ల మ‌ధ్య మొద‌లైన‌ గొడవ రోడ్డుపై కొట్టుకునే వరకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More in Local