← Back to news

సెప్టెంబర్ 4న గోకులాష్టమి వేడుకలు

By krshekar kr47· 20 Aug 2026· Peddamallareddy, Bhiknoor, Kamareddy
సెప్టెంబర్ 4న గోకులాష్టమి వేడుకలు

TG: కామారెడ్డి జిల్లా భిక్కనూరు(M) జంగంపల్లిలో వచ్చే నెల 4న బ్రహ్మజ్ఞానాశ్రమం ఆధ్వర్యంలో మురళీకృష్ణ మందిరంలో గోకులాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు. వేడుకల్లో భాగంగా ప్రభాతభేరి, ధ్వజారోహణం, గోవుపూజ, గణపతిపూజ, గౌరీపూజ, నవగ్రహపూజ, పట్టు వస్త్రాల ఊరేగింపు, క్షీరాభిషేకం, హారతి, చప్పన్ భోగ్, లక్ష పుష్పార్చన, అన్నప్రసాద వితరణ, డోలారోహణం, ఉట్టికొట్టుట, భజన నిర్వహించనున్నారు.

More in Local