‘శక్తి’ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలి

TG: పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తాలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోకు బీఆర్ఎస్ నందిపేట మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ మద్దతు ప్రకటించారు. విద్యార్థులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. మూడు సంవత్సరాలపాటు ప్రత్యేక సాంకేతిక విద్యను చదివే పాలిటెక్నిక్ విద్యార్థులను ఐటీఐ విద్యార్థులతో సమానంగా చూసేలా ప్రభుత్వం తీసుకొస్తున్న నిబంధనలు సరికావని అన్నారు. ‘శక్తి’ పథకం రద్దు చేయాలన్నారు.





