ఉపసర్పంచులకు గౌరవ వేతనం ఇవ్వాలి

TG: కామారెడ్డిలో ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తలు, ఉపసర్పంచుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి రాజంపేట ఉపసర్పంచ్ మీర్ ఇమ్రాన్ అలీ హాజరయ్యారు. ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు బొట్ల కార్తీక్ ముఖ్య అతిథిగా పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఉపసర్పంచులతోపాటు వార్డు సభ్యులకు గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఇమ్రాన్ అలీ కోరారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.



