← Back to news

కొత్త పంచాయతీ భవనానికి శంకుస్థాపన

By Naresh chary· 18 Aug 2026· Jankapur, Kannepally, Mancherial
కొత్త పంచాయతీ భవనానికి శంకుస్థాపన

TG: మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం జన్కపూర్ గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ కార్యాలయ భవనానికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎల్పుల మల్లేష్, సర్పంచ్ బోరిగామ వెంకటేష్ శంకుస్థాపన చేశారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాధవరపు నర్సింగరావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

More in Local