బావిలో నీరున్నా..ఎండుతున్న పంటలు

TG: నల్గొండ జిల్లా దండెంపల్లిలో కరెంటు సప్లై సరిగా లేక బోరులో నీళ్లున్నా పంటలకు నీరందని పరిస్థితి నెలకొంది. 24 గంటలు కరెంటు ఉంటుందని ప్రభుత్వ అధికారులు చెప్తున్నా, గ్రామంలో తరచూ కరెంట్ కట్ అవుతోందని రైతులు అంటున్నారు. మోటార్లు నడవకపోవడంతో పంటలు ఎండుతున్నాయని బాధపడుతున్నారు. ఈ సమస్య పట్ల కరెంట్ డిపార్ట్మెంట్ అధికారులు స్పందించి, కరెంట్ అందించాలని కోరుతున్నారు.



