40 ఏళ్ల తర్వాత దళితులకు ఆలయ ప్రవేశం
TG: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కమలాపూర్ గ్రామంలో విశ్వహిందూ పరిషత్ సామాజిక సమరసత అభియాన్ ఆధ్వర్యంలో 40 ఏళ్ల తర్వాత దళితులకు హనుమాన్ ఆలయంలోకి ప్రవేశం కల్పించారు. స్వామీజీలు, గ్రామ పెద్దలు, వివిధ సంఘాల నాయకుల సమక్షంలో దళిత యువకులను భుజాలపై మోసుకుంటూ ఆలయంలోకి తీసుకెళ్లి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్, చందూరావు, వామనరావు తదితరులు పాల్గొన్నారు.



