సరంపల్లిలో వైద్య శిబిరం..ఆరోగ్యంపై అవగాహన

TG: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని సరంపల్లిలో వైద్య శిబిరం నిర్వహించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి, ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించినట్లు హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ త్రివిక్రమాచారి తెలిపారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు షుగర్ బీపీ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఆరోగ్య ఆశా అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.



