విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వినతి

AP: కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన PGRS కార్యక్రమంలో SFI విద్యార్థి సంఘం నేతలు జిల్లాలోని విద్యార్థుల సమస్యలను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కు దృష్టికి తీసుకెళ్లారు. శంఖవరంలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్ను తిరిగి ప్రారంభించాలని అన్నారు. కాకినాడ పి.ఆర్ డిగ్రీ కాలేజ్లో బి.బి.ఏ కోర్సును ఈ ఏడాది నుంచి నిలిపివేశారన్నారు. బీబీఏ కోర్సును తిరిగి ప్రారంభించాలన్నారు. విద్యార్థి సంఘాలను హాస్టల్స్లోకి వెళ్లకుండా నిషేధిస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకమైన జీవోను రద్దు చెయ్యాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.



