← Back to news

దళితుల స్మశాన భూమి ఆక్రమణ..

By ORSU KRISHNA· 20 Aug 2026· Vinukonda
దళితుల స్మశాన భూమి ఆక్రమణ..

AP : వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం పిచ్చుకలపాలెం గ్రామంలోని దళితుల స్మశానవాటిక ఆక్రమణకు గురైందని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సర్వే నంబర్ 280-2లోని 299 సెంట్ల స్మశాన భూమిని ఆక్రమణదారుల నుంచి విడిపించి, కంచె వేసి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. త్వరలోనే సర్వే చేయించి, హద్దులు నిర్ణయించి బోర్డు ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.

దళితుల స్మశాన భూమి ఆక్రమణ..

More in Local