తుమ్మిడిహట్టి ఎత్తు పెంపే లక్ష్యంగా.. కేంద్రంతో సీఎం భేటీ

TG: ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి బ్యారేజ్ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా కేంద్ర సహకారంపై నిన్న సీఎం రేవంత్రెడ్డి దిల్లీకి వెళ్లారు. బ్యారేజ్ ఎత్తు పెంచినా మహారాష్ట్రలో ముంపు సమస్యలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ను ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి కలిసిన సీఎం తుమ్మిడిహట్టి ప్రాజెక్టు తెలంగాణాకు ప్రయారిటీను వివరించారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం పంపిన లేఖ గురించి కూడా వివరించినట్లు తెలుస్తోంది.



